Pages

Wednesday, December 5, 2018

యథారాజా తథా ప్రజాః

మనలో చాలా మంది “యథారాజా తథా ప్రజాః” అనే నానుడి విని ఉంటాం. అయితే ఇది ఒక మంచి సంస్కృత నీతి శ్లోకంలో చివరి అర్ధభాగమని ఎంతోమందికి తెలియక పోవచ్చు. ఇదిగో మరి ఆ శ్లోకం.
రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః, పాపేపాపా-స్సమే సమాః ।
లోకాస్త మనువర్తంతే, యథారాజా తథాప్రజాః ।।
రాజు ధర్మంగా నడుచుకుంటే ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. రాజు పాపి అయితే ప్రజలూ పాపప్పనులే చేస్తారు. రాజు పాపపుణ్యాలు సమంగా చేస్తే ప్రజలూ ఆ రాజునే అనుసరిస్తారు. మొత్తానికి రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగుంటారు.

No comments:

Post a Comment